Nagarjuna: నాకు జ్వరం వచ్చింది... మీరు జాగ్రత్త: నాగార్జున

  • నీరు నిలవకుండా చూడండి
  • దోమల వల్లే అనారోగ్యాలు
  • కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ నాగ్ ట్వీట్

నిలవనీరు కారణంగా దోమలు వ్యాప్తి చెంది, తాను వైరల్ జర్వం బారిన పడ్డానని, ఇప్పుడు కాస్తంత కోలుకున్నా, ఒళ్లు నొప్పులు మాత్రం చాలా అధికంగా ఉన్నాయని అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. దోమల వల్లే అనారోగ్యాలు వస్తున్నాయని అంటూ, తాను అన్నపూర్ణ స్టూడియోలో, తన ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా శుభ్రం చేయించానని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తన వారందరికీ ఇదే మాట చెప్పానని, ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో, పని చేస్తున్న ప్రదేశాల్లో నిలవ నీటిని వెంటనే తొలగించాలని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ, తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ నూ నాగార్జున ట్యాగ్ చేశారు.

More Telugu News