గణేశ్ లడ్డూ 5.4 లక్షలు...పూజకు ఉంచిన ఐదు వెండి నాణాలు రూ.5.5 లక్షలు
- అమీన్పూర్ వినాయకుడి ప్రసాదానికి రికార్డు స్థాయి ధర
- బీరంగూడ శివాలయం చౌరస్తా మండపంలో వేలం
- లడ్డూను దక్కించుకున్న స్థిరాస్తి వ్యాపారి
కాగా, స్వామి వారి పూజకు ఉంచిన 20 గ్రాముల వెండి నాణాలకు కూడా వేలంలో రికార్డు ధర పలికింది. తొమ్మిది రోజులపాటు గణపతి పూజలో ఉంచిన నాణాలు కావడంతో భక్తులు వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపించారు. మొదటి దానిని మధు రూ.1.8 లక్షలకు, రెండోది తన్నీరు ఏడు కొండలు రూ.లక్షకు, మూడోది వీరారెడ్డి రూ.80 వేలకు, నాలుగోది వెంకటరావు రూ.88 వేలకు, ఐదో నాణాన్ని రూ.1.10 లక్షలకు బ్రహ్మయ్య సొంతం చేసుకున్నారు.
కాగా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ మండపం వద్ద మంగళవారం నిర్వహించిన వేలం పాటలో లడ్డూను రూ.7 లక్షలకు స్థానికుడు సర్గారి రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇక్కడి లడ్డూ 5.5 లక్షలు పలకగా, ఈసారి డిమాండ్ పెరిగింది.