తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు
- ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
- అప్పట్లో బాధితురాలి పిటిషన్ స్వీకరించని కోర్టు
కాగా, తనపై కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయిన షరీఫ్.. గతేడాది నవంబరు 28న భార్యకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అనంతరం ముమ్మారు తలాక్ చెప్పాడు. ఇకపై ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో సుమయబాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు నాంపల్లి 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఆమె పిటిషన్ను కోర్టు అనుమతించలేదు. అయితే, తాజాగా ట్రిపుల్ తలాక్ చట్టం రావడంతో ఆ చట్టం కింద తన భర్తపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుమయబాను బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు షరీఫ్పై కేసు నమోదు చేశారు. కొత్తగా వచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం కింద తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.