ఎవరు చెబితే పోలవరం పనులను ఆపేశారు?: దేవినేని ఉమ
- పోలవరం ప్రాజెక్టును ఎందుకు ఆపారో ప్రజలకు చెప్పాలి
- పనులు ఆగడం వల్ల 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న ఉమ
- జగన్ పాలనంతా తప్పుల తడకేనన్న కొల్లు రవీంద్ర
రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల వేలాది మంది కార్మికులు పనులను కోల్పోయారని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ 100 రోజుల పాలన అంతా తప్పుల తడకేనని విమర్శించారు. సొంతవారికి దోచిపెట్టేందుకే కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రజలపై మరింత భారం మోపే విధంగా ప్రభుత్వ తీరు ఉందని చెప్పారు.