Jagan: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు

  • టీడీపీ నుంచి కొనసాగుతున్న వలసలు
  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న అడారి ఆనంద్, పిల్లా రమాకుమారి
  • కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికిన జగన్
ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా, విశాఖ జిల్లా టీడీపీ నేతలు అడారి ఆనంద్, పిల్లా రమాకుమారి పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో ఆనంద్, రమాకుమారి వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వారికి జగన్ సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Jagan
YSRCP
Telugudesam
Vizag

More Telugu News