Prabhas: నైజామ్ లో తొలిరోజు వసూళ్లలో 'బాహుబలి 2' ను అధిగమించిన 'సాహో'

  • నిన్ననే విడుదలైన 'సాహో'
  • నైజామ్ తొలిరోజు షేర్ 9.41 కోట్లు 
  • నెల్లూరులోను రికార్డుస్థాయి వసూళ్లు 

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో ఈ సినిమా తొలిరోజున రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తొలిరోజున నైజామ్ లో ఈ సినిమా 9.41 కోట్ల షేర్ ను సాధించింది. గతంలో 'బాహుబలి 2' రాబట్టిన తొలి రోజు వసూళ్ల కంటే ఇది ఎక్కువ.

ఇక నెల్లూరులోను ఈ సినిమా తొలి రోజున 'బాహుబలి 2' కంటే ఎక్కువ (2.56 కోట్లు) వసూలు చేసింది. ఈ రెండు ఏరియాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో 'బాహుబలి 2' రికార్డులను 'సాహో' అధిగమించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజునే 35.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 'బాహుబలి 2' సంచలన విజయం తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్లనే 'సాహో'కి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News