Vijay Sai Reddy: చంద్రబాబు 'అజ్ఞాత' పార్టనర్... ఇప్పుడు యూటర్న్ మాస్టర్: విజయసాయి రెడ్డి!

  • పవన్ పేరు చెప్పకుండా విమర్శలు
  • నాడు అమరావతి 'టీడీపీ రాజధానని' గర్జించారు
  • ఇప్పుడేమో మారిస్తే ఒప్పుకోబోనని యూటర్న్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండా, ఆయన అమరావతిపై తన వైఖరిని మార్చుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. "చంద్రబాబు ‘అజ్ఞాత పార్ట్‌నర్‌’ కూడా యూటర్నుల మాస్టర్‌ అయిపోయారు. నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారు?" అని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News

Vijay Sai Reddy
Pawan Kalyan
Amaravati
Twitter