అరుణ్ జైట్లీ మరణం దేశానికి తీరని లోటు!: తెలంగాణ సీఎం కేసీఆర్

  • ఆర్థికమంత్రిగా జైట్లీ సేవలు మరువలేనివి
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
  • తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్య
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఈరోజు ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

 జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతేడాది అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అయితే కొంత కాలానికే జైట్లీకి అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
Go Back to Shorts
Telangana
KCR
Arun Jaitly
dead
response

More Telugu News