BSE: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా మూడురోజుల లాభాలకు బ్రేక్
  • బీఎస్ఈ 74 పాయింట్లు,నిఫ్టీ 37 పాయింట్ల నష్టం  
  • లాభపడ్డ మారుతీ, టాటా మోటార్స్ సంస్థల షేర్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ 74 పాయింట్లు నష్టంతో 37,328 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 11,017 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మారుతీ, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఎస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా బుల్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలబాటలో కొనసాగిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో మునగడం గమనార్హం.

More Telugu News