Jagan: రాఖీ కట్టిన షర్మిల... చెల్లెమ్మకు మిఠాయి తినిపించిన సీఎం జగన్

  • నేడు రాఖీ పండుగ
  • చెల్లెలు రాఖీ కట్టడంతో జగన్ ఆనందం
  • సామాజిక మాధ్యమాల్లో సందడి ఫొటోలు

రాఖీ పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. సంప్రదాయాన్ని అనుసరించి తన సోదరుడికి రాఖీ కట్టిన షర్మిల సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా తన సోదరి షర్మిలకు ఎంతో అనురాగంతో మిఠాయి తినిపించిన జగన్ ఓ అన్నగా మురిసిపోయారు. ఈ రాత్రికి అమెరికా వెళుతున్న జగన్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగానే షర్మిల రాఖీ కట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

More Telugu News