KCR: మరి కాసేపట్లో కంచి, తిరుమల పర్యటనలకు బయల్దేరనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తిరుమల, తమిళనాడులోని కంచి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. తన కుటుంబంతో కలసి ఆయన ఈ ఆలయాలను దర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కంచికి బయల్దేరనున్నారు. అక్కడున్న అత్తి వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో, తిరుమలలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.