ఈ రోజు ’బ్లాక్ మండే’గా చరిత్రలో నిలిచిపోతుంది: డెరెక్ ఓబ్రెయిన్

  • జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో తీవ్ర చర్చ
  • రాజ్యాంగం, పార్లమెంట్ కు ఈ రోజు చీకటి రోజు
  • కేంద్రం చర్య రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ను పరిహసించేలా ఉంది
జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో వాడీవేడీ చర్చజరుగుతోంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ, ఈరోజు ‘బ్లాక్ మండే’గా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, పార్లమెంట్ కు ఈ రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. బీజేపీ చర్యలు రాజ్యాంగంలోని 3వ అధికరణానికి విరుద్ధంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చర్య రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ను పరిహసించేలా ఉందని అన్నారు. 
Go Back to Shorts
Jammu And Kashmir
TMC
Derek O`brein

More Telugu News