Andhra Pradesh: విజయవాడలో కారు బీభత్సం.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు!

  • నగరంలోని అయోధ్యనగర్ వద్ద ఘటన
  • రెండు ఆటోలను ఢీకొట్టిన కారు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అయోధ్యనగర్ కరకట్ట వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతూ  రెండు ఆటోలను, ఓ బాలుడిని ఢీకొట్టింది. అయినా ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు బాలుడు ప్రాణాలు కోల్పోగా, రెండు ఆటోల్లోని ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ కారు ఎవరిది, ఎవరు నడుపుతున్నారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన నగర పోలీసులు కారు వివరాల కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News