Andhra Pradesh: పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏపీ నూతన గవర్నర్ కు కేటాయించే యోచన!

  • రెండ్రోజుల్లో విజయవాడ రానున్న హరిచందన్
  • పాత సీఎం కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు
  • సీసీ కెమెరాల పని తీరు, భద్రతా ఏర్పాట్లపై పోలీసుల ఆరా

ఏపీకి నూతన గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను నియమించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో హరిచందన్ విజయవాడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఆయనకు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కార్యాలయాన్ని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. అక్కడ  సీసీ కెమెరాల పని తీరు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.

More Telugu News