కివీస్ ఆల్ రౌండర్లను తక్కువ స్కోరుకే సాగనంపిన టీమిండియా బౌలర్లు

  • నీషామ్, గ్రాండ్ హోమ్ నిష్క్రమణ
  • కివీస్ స్కోరు 46 ఓవర్లలో 5 వికెట్లకు 209 రన్స్
  • వ్యూహాత్మకంగా బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్లు
న్యూజిలాండ్ జట్టులో ఆల్ రౌండర్లుగా పేరుతెచ్చుకున్న జిమ్మీ నీషామ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్ కీలకమైన సెమీస్ పోరాటంలో చేతులెత్తేశారు. వీళ్లిద్దరినీ టీమిండియా బౌలర్లు స్వల్పస్కోరుకే పెవిలియన్ దారిపట్టించారు. నీషామ్ 12 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లో అవుట్ కాగా, గ్రాండ్ హోమ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద భువనేశ్వర్ కుమార్ విసిరిన స్లో డెలివరీకి బోల్తాపడ్డాడు.

సాధారణంగా టాపార్డర్ విఫలమైన చాలా మ్యాచ్ ల్లో వీళ్లిద్దరూ ఎంతో వీరోచితంగా ఆడి భారీ స్కోర్లు సాధించిన సందర్భాలున్నాయి. అయితే, భారత బౌలర్లు కివీస్ జట్టులోని ప్రతి బ్యాట్స్ మన్ కు ప్రత్యేక వ్యూహాలు అమలుచేసి విజయం సాధించారనే చెప్పాలి. ప్రస్తుతం కివీస్ స్కోరు 46 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు. క్రీజులో రాస్ టేలర్, టామ్ లాథమ్ ఆడుతున్నారు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న టేలర్ 65 పరుగులతో బరిలో ఉన్నాడు.
Go Back to Shorts
India
New Zealand
World Cup
Semis

More Telugu News