Andhra Pradesh: సీఎం జగన్ గారూ.. ఈ ఒక్క విషయాన్ని ఏపీ ప్రజలకు వివరించండి!: టీడీపీ నేత కేశినేని నాని

  • జగన్-కేసీఆర్ చొరవను స్వాగతిస్తున్నా
  • తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా ప్రవర్తిస్తారా?
  • లేక ఆంధ్రాను ఆదుకుంటారా?
  • ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విజయవాడ ఎంపీ

సోషల్ మీడియాలో చురుగ్గా వుండే విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సీఎం జగన్, ఆయనకు దేవుడిచ్చిన స్నేహితుడు కేసీఆర్ చొరవ తీసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేశినేని నాని తెలిపారు.

‘అయితే ఈ సమస్యలను తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా పరిష్కరిస్తారా? లేదా ఏపీకి రావాల్సిన ప్రయోజనాల కోసం పనిచేస్తారా? ఈ విషయాన్ని ఏపీ ప్రజలకు ఓసారి వివరించండి’ అని సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు కేశినేని నాని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో మరి!  

More Telugu News