Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్!

  • ఈరోజు ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్, జగన్, ఫడ్నవీస్
  • కదిలి వచ్చినది కాళేశ్వరం జలధార అంటూ సాగుతున్న పాట
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక గీతాన్ని విడుదల  చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా..‘కదలి వచ్చినది కాళేశ్వరం జలధార’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతాన్ని మీరూ చూసేయండి.

More Telugu News