కేసీఆర్ అపర భగీరథుడు.. రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: హరీశ్ రావు
- తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే ‘కాళేశ్వరం’
- కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ వల్లే త్వరగా పూర్తయింది
- కష్టపడిన అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు
ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మహారాష్ట్రతో ఏర్పడిన వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించారంటూ కేసీఆర్ను హరీశ్ కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతుల పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.