అవుటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఎక్కేసి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు

  • హైదరాబాద్ నుంచి అత్తిలికి కారులో ప్రయాణం
  • మృతుడు-క్షతగాత్రులు ఒకే గ్రామానికి చెందిన వారు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైకెక్కి అటువైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన విశ్వంత్‌, నారాయణ, కృష్ణ, గణేష్‌లు కారులో హైదరాబాద్‌ నుంచి అవుటర్‌ రింగురోడ్డు మీదుగా స్వగ్రామానికి బయలుదేరారు.

శంషాబాద్‌ పరిధిలోని హమీదుల్లానగర్‌ సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కేసింది. అదే సమయంలో అత్తిలి గ్రామం నుంచే హైదరాబాద్ వస్తున్న బాల వెంకటసుబ్రహ్మణ్యం (66) కారును ఇది ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాలవెంకట సుబ్రహ్మణ్యం, విశ్వంత్‌, నారాయణ, కృష్ణలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలవెంకట సుబ్రహ్మణ్యం మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి, గాయాలపాలైన వారు ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Hyderabad
Outer ring road
West Godavari District
Attili

More Telugu News