Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీరు అందిచేందుకు చర్యలు: బాలినేని

షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్, జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఉందని అన్నారు. ఒంగోలు, మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని అన్నారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, విద్యుత్ శాఖలో అవకతవకలపై సమీక్షిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Minister
Balineni
Srinivas

More Telugu News