ఎల్లుండే మంత్రుల ప్రమాణం... పదవులు ఎవరికి ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చేసిన జగన్!

  • రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి చాన్స్
  • బీసీలకు 6, కాపు, కమ్మలకు రెండేసి
  • 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం 8న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో సీఎం వైఎస్ జగన్, ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని వైకాపా వర్గాలు అంటున్నాయి. సామాజిక వర్గాల వారీగా, ఎవరికీ అన్యాయం జరుగకుండా పదవుల పంపకాన్ని ఆయన పూర్తి చేశారని చెబుతున్నాయి. జగన్ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ఆరుగురికి, కాపు, కమ్మ, ఎస్సీ మాల వర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఎస్సీ మాదిగ, ఎస్టీ, క్షత్రియ, ముస్లిం, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున జగన్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అంటే, మొత్తం 25 మందితో ఆయన పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
Ministers

More Telugu News