Andhra Pradesh: మంత్రివర్గం ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. ఈ నెల 7న వైసీఎల్పీ భేటీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గం ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 7న జగన్ నేతృత్వంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రివర్గ కూర్పుపై జగన్ నేతలతో చర్చిస్తారని సమాచారం. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.