jio: వేలాది మంది ఉద్యోగులను తొలగించిన జియో?

షార్ట్స్‌లో చూడండి
దాదాపు 5వేల మంది ఉద్యోగులను రిలయన్స్ టెలికాం సంస్థ జియో తొలగించినట్టు తెలుస్తోంది. వీరిలో భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. మార్కెట్లో పోటీ పెరగడం, నిర్వహణా లాభం పెంచాల్సిన అవసరం రావడంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంతో ఈ మేరకు ఉద్యోగులను జియో తొలగించింది. మరోవైపు జియోకు సంబంధించిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉద్యోగులను తొలగించినప్పటికీ... కొత్తగా చేర్చుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. జియో సంస్థలో ప్రస్తుతం 15వేల నుంచి 20వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
jio
employees

More Telugu News