Vijayawada: పొట్లూరి వరప్రసాద్ రాజకీయ ఆశలకు గండికొట్టిన కేశినేని నాని... విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీ వశం

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో  విజయవాడ స్థానాన్ని నిలబెట్టుకుంది. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై విజయం సాధించారు. సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ ఇటీవలే మహర్షి చిత్రంతో మాంచి ఊపుమీదున్నారు. గతకొంతకాలంగా రాజకీయరంగంపై కన్నేసిన ఆయన ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో వైసీపీ టికెట్ అందుకున్నారు. కానీ, విజయవాడలో ఎంతో పట్టు ఉన్న కేశినేని ముందు నిలవలేకపోయారు.
Go Back to Shorts
Vijayawada
Telugudesam

More Telugu News