Hyderabad: ‘జనసేన’ కార్యాలయంలో ఘనంగా ఇఫ్తార్ విందు

  • హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో విందు
  • పాల్గొన్న ముస్లిం మత పెద్దలు, నాయకులు  
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపిన నేతలు.

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్క‌రించుకొని హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సినీన‌టుడు ఖయ్యూమ్, ముస్లిం మహిళ సంఘం నాయకులతో పాటు దాదాపు ఐదువందల మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమాజ్ నిర్వహించారు. ముస్లింలకు జనసేన పార్టీ నేతలు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సందర్భంగా ముస్లిం మతపెద్ద మహ్మద్ సిరాజ్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ, పేదవాడి ఆకలి బాధలను తెలుసుకోవడమే పవిత్ర రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని మత సామరస్యం మన దేశంలోనే ఉందని, అదే మన గొప్పతనమని అన్నారు. ‘తల్లి పాదాల చెంతే స్వర్గం ఉందని ఇస్లాం చెప్పింది’ అని ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త‌న ప్ర‌సంగాల్లో చెప్పినప్పుడు ఎంతో ఆనందపడ్డానని అన్నారు. ఈ విందులో జనసేన పార్టీ ముఖ్యనేతలు మాదాసు గంగాధరం, అర్హం యూసఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

More Telugu News