Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విషయాన్ని నాన్చనంటున్న రకుల్!
  • 'మన్మథుడు -2' షెడ్యూల్ పూర్తి 
  • ఆ చిత్రంలో నలుగురు నాయికలు!

*  'ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అది చేస్తానా? లేదా? అన్నది ఐదు నిమిషాల్లో తేల్చేస్తాను..' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ''నేను మొదటి నుంచీ అంతే.. ఏ విషయాన్నీ నాన్చను. వెంటనే నిర్ణయం తీసేసుకుంటాను. సినిమాల విషయంలో కూడా అంతే.. కథ వినగానే ఏదో ఒకటి చెప్పేస్తాను. 'తర్వాత చెబుతాను, మళ్లీ చెబుతాను' వంటి మాటలు చెప్పను'' అని చెప్పింది రకుల్.  
*  నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు- 2' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజుల నుంచి పోర్చుగల్ లో జరుగుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. తదుపరి షెడ్యూలు హైదరాబాదులో చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది.
*  నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం నలుగురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం. వీరిలో ఓ కథానాయికగా మేఘా ఆకాశ్ ఇప్పటికే ఎంపికైంది.

More Telugu News