మే 23 తర్వాత కేసీఆర్ సర్కార్ సంగతి తేలుస్తాం: బీజేపీ నేత లక్ష్మణ్

  • రాష్ట్రంలో సమస్యలను కేసీఆర్ గాలి కొదిలేశారు
  • గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
  • విద్యాశాఖ మంత్రి నోరు మెదపరే!
రాష్ట్రంలో సమస్యలను గాలి కొదిలేసి కేసీఆర్ తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అని ప్రశ్నించారు. మే 23 తర్వాత కేసీఆర్ సర్కార్ సంగతి తేలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే విద్యాశాఖ మంత్రి నోరు మెదపట్లేదని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
bjp
lakshman

More Telugu News