ఐదు రోజుల నిరాహారదీక్షను విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్!
- దీక్ష ప్రారంభంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
- నిమ్స్ కు తరలిస్తే, అక్కడే దీక్ష చేసిన లక్ష్మణ్
- నిమ్మరసం ఇచ్చిన కేంద్ర మంత్రి హన్సరాజ్
ఐదు రోజుల క్రితం లక్ష్మణ్ దీక్షను ప్రారంభించగా, అదే రోజు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ నిమ్స్ లోనే తన దీక్షను కొనసాగించారు. వైద్య చికిత్సనూ నిరాకరించారు. కాగా, హన్సరాజ్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపీ దత్తాత్రేయ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.