తూచ్... చనిపోయింది 253 మందే: శ్రీలంక అధికారిక ప్రకటన
- తొలుత 359 మరణించారని ప్రకటన
- సరైన వివరాలు తెలుసుకున్న తరువాత సవరణ
- వెల్లడించిన లంక ఆరోగ్య శాఖ
ఎంతో మంది మృతుల శరీరాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనాయని, ఆ కారణంతోనే కొన్ని మృతదేహాలను రెండేసి సార్లు లెక్కగట్టడం వల్ల సంఖ్యలో తేడా వచ్చిందని పేర్కొంది. కాగా, లంకలోని చర్చ్ లు, హోటళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కారణంగా వందలాది మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఉగ్రదాడులపై ఇంటర్ పోల్, స్కాట్లాండ్ యార్డ్, ఎఫ్బీఐ సహా ఆరు విదేశీ పోలీస్ ఏజన్సీలు లంక పోలీసుల విచారణకు సహకరిస్తున్నాయి.