సీఎం అయ్యేంతవరకూ నా బట్టలు నేనే ఉతుక్కునే వాడిని: నరేంద్ర మోదీ
- ఎక్కడికి వెళ్లినా దుస్తులు శుభ్రం చేసుకునేవాడిని
- పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో చెడు ప్రభావం
- సోషల్ మీడియా అంటే ఆసక్తి పెరిగిందన్న మోదీ
మామూలు సమయాల్లో తాను సాయంత్రం 5 గంటలకెల్లా డిన్నర్ ముగించేస్తానని చెప్పారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారు పడే కష్టమే వారిని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని చెప్పారు. సోషల్ మీడియా అంటే తనకెంతో ఆసక్తి ఉందని, మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా, సాంకేతికత అందించే సౌలభ్యాలను అందిపుచ్చుకోవడం తనకు ఇష్టమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.