ఫోన్ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్ చేస్తే స్పందించలేదని మరొకరు ఆత్మహత్య
- కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఘటన
- రెండు ఘటనలకూ సెల్ఫోనే కారణం
- ప్రాణాలు తీసుకున్నది కూడా వివాహితలే
మరో ఘటనలో.. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన కడమంచి స్వామి- స్వప్న(20) దంపతులు. రెండేళ్ల క్రితమే వివాహమైన వీరికి ఏడు నెలల పాప ఉంది. భర్త స్మార్ట్ఫోన్ను తాకిన ప్రతిసారి అతడు గొడవకు దిగేవాడు. తన ఫోన్ ముట్టుకోవద్దని చాలాసార్లు హెచ్చరించాడు. దీంతో, తనకూ ఓ ఫోన్ కొనివ్వాలని స్వప్న మంగళవారం పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన స్వామి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోంచి విసురుగా వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో మనోవ్యధకు లోనైన స్వప్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.