తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గ ఎన్నిక వాయిదా

  • భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు
  • ఎన్నిక వాయిదాకు రాష్ట్రపతికి ఈసీ సిఫారసు
  • రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వాయిదా పడ్డ ఎన్నిక
ఈ నెల 18న తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నిక వాయిదా పడింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

కాగా, ఈ నియోజకవర్గంలో ఇటీవల భారీ నగదును సీజ్ చేశారు. వెల్లూరు డీఎంకే అభ్యర్థి కదిరి ఆనంద్ కు చెందిన గోదాంలో 11.53 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోలింగ్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిన్న రాత్రి ఈసీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఎన్నిక రద్దు అయింది.
Go Back to Shorts
Tamilanadu
veluru
loksabha
election

More Telugu News