దేశవ్యాప్తంగా 11 గంటల వరకూ 24.32 శాతం ఓటింగ్... ఏపీలో మాత్రం 15 శాతమే!
- ఉత్సాహంగా సాగుతున్న పోలింగ్
- కొన్ని చోట్ల రెండు గంటలు ఆలస్యంగా మొదలు
- ఆరింటి వరకూ లైన్లో ఉన్న అందరికీ ఓటేసే చాన్స్
- ఏపీ సీఈసీ గోపాలకృష్ణ ద్వివేది
ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని పెంచే అవకాశాలు లేవని, అయితే, సాయంత్రం 6 గంటల వరకూ క్యూ లైన్లో ఉన్న అందరూ ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని, అందరూ ఓటు వేసి వెళ్లేంతవరకూ రాత్రి 9 గంటలైనా పోలింగ్ కొనసాగుతుందని ద్వివేది స్పష్టం చేశారు.
వివిధ మీడియా సంస్థల్లో వస్తున్నట్టుగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయనడం అవాస్తవమని స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలనూ పరిష్కరించామని, మరో 24 చోట్ల సమస్యలను పరిష్కరించేందుకు ఇంజినీర్లను పంపామని అన్నారు. మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఈవీఎంలపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని అన్నారు.