నాలుగో విడత రుణమాఫీ కింద రూ.3,979.46 కోట్ల నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

  • 8న బ్యాంకుల్లో నమోదు చేసుకున్న రైతులు
  • రూ.282 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
  • నేడు రూ.519 కోట్లు మంజూరు
ఏపీలో రైతులకు రుణమాఫీ నాలుగో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగో విడత కింద రూ.3,979.46 కోట్ల నిధులను 31.44లక్షల ఖాతాలకు గాను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 2 లక్షల మంది రైతులు ఈనెల 8న రుణ ఉపశమన అర్హత పత్రాన్ని బ్యాంకులకు వెళ్లి నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.282 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు గాను బ్యాంకులకు పంపించింది. నిన్న సుమారు రూ.4.49 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం రూ.519 కోట్లను మంజూరు చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Formers
Banks
Accounts

More Telugu News