మోదీ గురించి ఒక్క మాట మాట్లాడినా జగన్‌ జైలుకు వెళ్తాడు : కోడెల శివప్రసాద్‌

  • అందుకే మాట్లాడేందుకు భయపడతాడు
  • స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మోదీ
  • ప్రజల్ని రెచ్చగొట్టి లబ్దిపొందాలని వైసీపీ చూస్తోంది
ప్రధాని మోదీ గురించి ఒక్క మాట మాట్లాడినా వైసీపీ అధినేత జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని, ఈ విషయం తెలుసుకాబట్టే ఆయన గురించి నోరు కూడా మెదపడని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ విమర్శించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. మరోవైపు అధికారమే లక్ష్యంగా ఆత్రం పడుతున్న వైసీపీ ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ దుర్మార్గపు చర్యలకు తెరలేపిందని ఆరోపించారు.
Go Back to Shorts
Jagan
Narendra Modi
kodela sivaprasad

More Telugu News