మల్కాజిగిరిలో మొత్తం 40 నామినేషన్లు... 27 తిరస్కరణ!
- వివిధ కారణాలతో నామినేషన్ల తిరస్కరణ
- బరిలో మిగిలింది 13 మంది
- రేవంత్, మర్రి, రాంచదర్ రావుల మధ్య ప్రధాన పోటీ
వీరితో పాటు ప్రజాసత్తా నుంచి ధర్మాసనం భానుమూర్తి, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి బురు బాలమణి, జనసేన నుంచి మహేందర్రెడ్డి, సోషల్ జస్టీస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చామకూర రాజయ్యలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సీహెచ్ చంద్రశేఖర్, ఇందూరం తిరుపతయ్య, దొంతుల భిక్షపతి, పంబాల శివరాజ్, పొన్నాల రాజేందర్, గోనే సాయికిరణ్ లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుండటంతో, వీరిలో ఎవరు మిగులుతారన్న విషయం రేపు తేలుతుంది.