Andhra Pradesh: నేడు, రేపు నామినేషన్ల స్వీకరణకు బ్రేక్!

  • శని, ఆదివారం సెలవులు
  • అందుకే నామినేషన్ల స్వీకరణను ఆపేస్తున్నాం
  • సోమవారం తిరిగి నామినేషన్లను స్వీకరిస్తాం

సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులు బ్రేక్ పడనుంది. ఈరోజు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ రెండ్రోజులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోతుంది. తిరిగి సోమవారం నామినేషన్లను యథాతథంగా స్వీకరిస్తారు.

ఈ విషయమై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. రెండ్రోజులు సెలవులు కావడంతో నామినేషన్ల ప్రక్రియ నిలిచిపోతుందని, సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుందని తెలిపారు. ఈ నెల 28 వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

More Telugu News