ఐదు రోజుల క్రితం జనసేనలో చేరిక... ఇప్పుడు జగన్ వైపు చూపు!
- ఇటీవల జనసేనలో చేరిన దేవినేని మల్లికార్జునరావు
- టికెట్ దక్కకపోవడంతో అలక
- నేడో, రేపో వైసీపీలో చేరే అవకాశం
కాగా, 2004లో రేపల్లె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా, దేవినేని చేరికతో, రేపల్లె, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ బలం పెరిగి, సులువుగా గెలుచుకోవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జనసేన నుంచి దేవినేనికి టికెట్ లభిస్తుందని తొలుత భావించినా, పవన్ మాత్రం కమతం సాంబశివరావువైపు మొగ్గు చూపారు. కమతానికి టికెట్ ఇస్తున్నట్టు మూడో జాబితాలో పేరును చేర్చారు. దీంతో ఆయన వర్గం తీవ్ర ఆగ్రహంలో ఉంది. జనసేనలో ఉండవద్దని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండగా, వైకాపాలో చేరేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు.