కంప్యూటర్ తెరపైనే ఇలా ఉంటే ఇక వెండితెరపై ఎలా ఉంటుందో!: నమ్రత
- సోషల్ మీడియాలో నమ్రత చాలా యాక్టివ్
- ‘మహర్షి’ సెట్స్కి వెళ్లిన నమ్రత
- చిత్రంలోని సన్నివేశాలు బాగా నచ్చాయి
ప్రస్తుతం మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్కి కుమారుడు గౌతమ్తో వెళ్లిన నమ్రత కంప్యూటర్ తెరపై సినిమా చిత్రీకరణను పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఒక పోస్ట్ పెట్టారు. చిత్రంలోని సన్నివేశాలు బాగా నచ్చాయని.. ఈ సినిమాను కంప్యూటర్ తెరపైన చూస్తేనే ఇలా ఉందంటే.. వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ పెట్టారు.