Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మహేశ్ బాబు కథానాయికగా రష్మిక
  • 'సైరా' కోసం కీలక సన్నివేశాలు 
  • నాగశౌర్యతో 'అర్జున్ రెడ్డి' నాయిక

*  మహేశ్ బాబు సరసన రష్మిక మందన నటించే అవకాశం కనిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ హీరోగా దిల్ రాజు నిర్మించే చిత్రంలోని ఓ కథానాయిక పాత్ర కోసం ప్రస్తుతం రష్మికతో సంప్రదింపులు జరుపుతున్నారట.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాదు శివారు కోకాపేటలో వేసిన సెట్స్ లో జరుగుతోంది. చిరంజీవి, జగపతిబాబులపై ఈ సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నాడు. ఈ నెల 10తో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.
*  నాగశౌర్య హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాశి విశాల్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా 'అర్జున్ రెడ్డి' ఫేం శాలిని పాండేను తీసుకున్నారు.

More Telugu News