ముఖ్యమంత్రులే కాదు.. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు కూడా ఉన్నారు!
- జవహర్ లాల్ నెహ్రూతో మొదలైన సంప్రదాయం
- అనుసరించిన ఇందిరా గాంధీ, రాజీవ్
- ఆర్థికశాఖను నిర్వహించినా బడ్జెట్ ప్రవేశపెట్టని మన్మోహన్ సింగ్
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి జవహర్ లాల్ నెహ్రూ బడ్జెట్ ను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు.
ఆయన తర్వాత ఇందిరాగాంధీ 1970-71 సంవత్సరానికి, రాజీవ్ గాంధీ 1987-88 కాలానికి బడ్జెట్ ను సమర్పించారు. యూపీఏ-1 హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా కొద్దికాలం ఆర్థిక శాఖను నిర్వహించారు. అయితే మన్మోహన్ సింగ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు.