‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్‌ రహిత సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ను శుక్రవారం భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.  భారత్‌లోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇది. ఈ సందర్భంగా రైలు ప్రయాణించే మార్గాల్లోని కాన్పూర్‌, అలహాబాద్‌ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహించారు.

 ఢిల్లీ-వారణాసి మధ్య మొత్తం 750 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేయనుంది. మధ్యలో కాన్పూర్‌, అలహాబాద్‌లో 40 నిమిషాలపాటు ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తోపాటు మరికొందరు మంత్రులు రైలులో కొద్దిదూరం ప్రయాణించారు.
Go Back to Shorts
vandebharat express
Narendra Modi
New Delhi

More Telugu News