Padmasri: జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్

  • కేసు డైరీ మాకు అందింది
  • పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
  • రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారిస్తాం

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి కేసు డైరీ తమకు చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం భార్య పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

ఈ నేపథ్యంలో తమపై పద్మశ్రీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. పద్మశ్రీ ఫిర్యాదు ఆధారంగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌ను నియమించామన్నారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు.  

More Telugu News