varun tej: బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటోన్న మెగాహీరో

  • జిగర్తాండ' రీమేక్ గా 'వాల్మీకి'
  • బాబీసింహా పాత్రలో వరుణ్ తేజ్ 
  • నాయికగా తెరపైకి ఈషా రెబ్బా పేరు  

ఈ ఏడాది ఆరంభంలోనే వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు. ఆయన తదుపరి సినిమా హరీశ్ శంకర్ తో వుండనుంది. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా .. సిద్ధార్థ్ చేసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి హరీశ్ శంకర్ రంగంలోకి దిగాడు.

ఈ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, బాబీసింహా పాత్ర కోసం వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ పాత్ర కోసమే వరుణ్ తేజ్ బాక్సింగ్ నేర్చుకోవలసి వచ్చింది. దాంతో ఆయన బాక్సింగ్ లో శిక్షణ తీసుకోవడం కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తికాగానే ఆయన తిరిగొచ్చి ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రకిగాను శ్రీవిష్ణును తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కథానాయికగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News