చిగురుపాటి జయరాం హత్య.. కేసును తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ పోలీసుల అంగీకారం!

  • హైదరాబాద్ లో జయరాం హత్య
  • నిందితులు నందిగామ కోర్టు ముందు హాజరు
  • ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించిన కోర్టు
ప్రముఖ వ్యాపారవేత్త చిరుగుపాటి జయరాం హత్య కేసులో నిందితులను తప్పించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య పద్మశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆమె హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణలోని హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ఈ కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారిద్దరికీ ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించింది. కాగా, జయరాం హత్య కేసులో వీరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
chiguru pati
jayaram
Hyderabad
murder

More Telugu News