చంద్రబాబుతో నేడు కేఈ ఫ్యామిలీ భేటీ.. మంత్రి ఆదినారాయణ రెడ్డికి లోక్ సభ టికెట్!
- టీడీపీ అధినేతతో రాయలసీమ నేతల భేటీ
- డోన్ అసెంబ్లీ సీటుపై కేఈ ఫ్యామిలీ ఆశలు
- రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇచ్చే ఛాన్స్
మరోవైపు కడప జిల్లా నేత, ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి-రామసుబ్బారెడ్డిలతో ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు భేటీ కానున్నారు. వీరిలో ఒకరిని కడప పార్లమెంటు సభ్యుడిగా, మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా కడప పార్లమెంటు స్థానం, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు విషయమై ఈ ఇద్దరు నేతలతో ముఖ్యమంత్రి పలుమార్లు సమావేశమయ్యారు.
ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఇద్దరికీ సూచించారు. అయితే, ఇద్దరూ తమకు జమ్మలమడుగు అసెంబ్లీ సీటే కావాలంటూ పట్టుబట్టారు. ఈ విషయంలో సయోధ్య కుదరకపోవడంతో తుది నిర్ణయాన్ని నేతలు చంద్రబాబుకే వదిలేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఆదినారాయణ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.