drought relief package: ఏపీకి రూ. 900 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం
ఏపీకి రూ. 900 కోట్ల కరవు సహాయ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు కరవు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మహారాష్ట్రకు రూ. 4700 కోట్లు, కర్ణాటకకు రూ. 950 కోట్లను తక్షణమే విడుదల చేయబోతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తెలిపారు. ఏపీకి రూ. 900 కోట్లు, గుజరాత్ కు రూ. 130 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.