చెప్పుల్లో రూ. 66 లక్షల విలువైన బంగారం... పట్టేసిన శంషాబాద్ అధికారులు!

  • షార్జా నుంచి ఇండోర్ వచ్చిన వ్యక్తి
  • మరో వ్యక్తి ద్వారా హైదరాబాద్ కు బంగారం
  • అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు
తన పాదరక్షల అడుగుభాగాన రెండు కిలోల బరువైన బంగారం బిస్కెట్లను తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని హైదరాబాద్, శంషాబాద్ ఆర్జీఐఏ అధికారులు పట్టేశారు. ఈ బంగారం విలువ దాదాపుగా రూ.66.2 లక్షలు ఉంటుందని డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు.

నిన్న ఉదయం షార్జా నుంచి ఓ ప్రయాణికుడు 2 కిలోల బంగారంతో, మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ ఎయిర్ పోర్టులో దిగాడని, తన వద్ద ఉన్న బంగారాన్ని ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన వ్యక్తికి అందించాడని వెల్లడించారు. ఆ వ్యక్తి రెండు బంగారం బిస్కెట్లను నాలుగు భాగాలుగా చేసి, తన చెప్పుల అడుగుభాగంలో పెట్టుకున్నాడని, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వేళ, అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, బంగారం బయటపడిందని చెప్పారు.
Go Back to Shorts
RGIA
Gold
Smugling
Shamshabad
Hyderabad
Indore
Police

More Telugu News