అటవీ శాఖ ఉద్యోగిపై దాడిచేసి చంపేసిన ఏనుగు
- ఏనుగులను తరిమేసే పనిలో ఉండగా ఘటన
- తొండంతో విసిరి, కాళ్లతో తొక్కేసి చంపిన గజం
- డెంకణీకోట సమీపంలోని తావరకరై అటవీ ప్రాంతంలో ఘటన
వీటిని తరుముతుండగా గున్న ఏనుగు ఒకటి వెనుకబడింది. గుంపులోని తల్లి ఏనుగు తన పిల్లకు ఏదో అపాయం జరుగుతుందని భావించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సిబ్బందిని వెంబడించింది. అందరూ భయంతో పారిపోగా మారప్ప (55) అనే అటవీ ఉద్యోగి తల్లి ఏనుగుకు దొరికిపోయాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఏనుగు మారప్పను తొండంతో విసిరికొట్టి కాళ్లతో తొక్కి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న మారప్పను మిగిలిన సిబ్బంది డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు. మారప్పకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.