ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుకు కారణం ఇదే: కేటీఆర్
- ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ గెలుపొందారు
- ఉత్తమ్ అంతటి అహంకారి మరెవరూ లేరు
- పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ప్రజలు తరిమికొడితే... కాంగ్రెస్ నేతలు ఆయనను మళ్లీ పట్టుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లతో కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 2014లో 63 సీట్లు గెలిస్తే... ఇప్పుడు 88 సీట్లు గెలిచామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని చెప్పారు.